సంగీతం లోని మాడుర్యానికి తెలుగు పదాలను కలిపి పాడిన పాటలు మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలాంటి కొన్ని పాటలు వింటుంటే అలసిన శరీరానికి చల్లని సాయంత్రపు గాలి తగిలినట్లుగా ఉంటుంది. ఉదాహరణకు 'లాలి లాలి అను రాగం' అనే ఇందిరా చిత్రం లోని పాట వింటుంటే వెన్నెల రాత్రిలో ఇంటి పైన చాప ఏసుకొని పడుకొంటే ఎంత హాయిగా ఉంటుందో అలా ఉంటుంది. అలానే కొన్ని పాటలు వింటుంటే పాటలోని ఆంతర్యం అర్థం కాకపోయినా అలానే హాయిగా ఉంటుంది. 'శశివదనే శశివదనే' అనే పాటలో ని భావం నాకు ఒక్క ముక్క కూడా అర్థం అవలేదు. అయినా బాగుంటుంది. ఎందుకూ అంటే నాకు కూడా తెలీదు. భహుశా అందులోని స్వరాలను జోల పాటలనుంచి తీస్కున్నరేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. బోయ్స్ చిత్రంలోని 'సరిగమే పదనిసే' పాట వింటుంటే మనకి పాడటం రాక పాయిన పాడాలనిపిస్తుంది. సత్య చిత్రం లోని 'గాలిలోనే మాటి మాటికి' పాట వింటుంటే మనసు గాల్లో తేలుతూ ఉంటుంది. గోదావరి లోని 'మనసా వాచా నిన్నే తలచా' అనే పాట వింటుంటే గోదావరి గట్టు మీద ఇసుక తిన్నెల్లో ఒక సాయత్రం గడిపినంత ఆనందం గ ఉంటుంది. ఈ పాట లో సంగీతం కంటే వేటూరి గారి పదాలతో ఆటలే ఆ పాటకు అందం.
ఇవన్నీ రూపాయి కి ఒక వైపు అయతే వీటికి ఇంకో కోణం కూడా ఉంటుంది. అలంటి కొన్ని పాటలను వింటుంటే జీవితం మీద విరక్తి పుట్టి అసలు ఎందుకూ బ్రతుకుతున్నామా అనే సందేహం కూడా వస్తూ ఉంటుంది.మనమే ఒక కీ బోర్డు మరియు ఒక వీణ తీస్కుని సంగీతం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. విరక్తి అనగానే నాకు మొదట గుర్తు వచ్చేది మన అభిమాన సంగీత సామ్త్రాట్ XXX గారు. దేశముదురులోని 'సత్తే సత్తే' పాట వింటుంటే నిజంగానే అలా అన్పించేస్తుంటుంది. కొంత మంది కి ఈ పాట నచుతుంటుంది కాని నాకు మాత్రం అసలు నచ్చదు. ఆ పాట పెట్టిన వాడికి ఆర్ నారాయణమూర్తి చిత్రాలను IMAX స్క్రీన్ మీద చూపించాలన్న కోపం వస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మొన్నీ మద్య చందానగర్ లో తిరుగుతూ ఉంటె ఎక్కడ చూసిన మన అభిమాన సంగీత దర్శకుడి జన్మ దిన శుభాకాంక్షలు అని చాలా పోస్టర్స్ అంటించారు. అబ్బా తనకి అభిమానులు కూడా ఉన్నారా అనుకోని, కలి కాలం కదా లోకులు ఇలానే ప్రవర్తిస్తారు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. కొంత మంది సంగీత దర్శకులను చుస్తే విరక్తి వస్తే కొంత మందిని చూస్తె నవ్వు వస్తుంది నాకు. ఆర్ పీ పట్నాయక్ గారు స్వర కూర్చిన చిత్రం 'నిజం' లోని 'రాముడమ్మ రాముడు' పాట గుర్తుకు వస్తుంది.ఆ పాటలో నవ్వు కల్గించేది ఎం లేకపోయినా నవ్వు వస్తుంటుంది. కాని తనే సంగీతం లోంచి వచ్చిన సంతోషం లోని 'ఏమైనదో ఏమో నాలో' అన్న పాట వింటుంటే నాలోనే ఏదో అయ్పోతుంటుంది. అంత బాగుంటుంది.
రాత్రి బస్సు లో ప్రయాణిస్తున్నప్పుడు బయట వర్షం పడతుండగా బస్సు అద్దాలపై వేలితో బొమ్మలు గీస్తూ పేర్లు రాస్తూ ఏం మాయ చేసావే లోని 'వింటున్నావా వింటున్నావా' పాట వింటుంటే కలిగే హాయిని మాటల్లో వర్ణించడం కూడా కష్టమే సుమీ....
ఎక్కడో విన్నాను కొన్ని పాటలను వింటుంటే గొంతులో తేనే పోసినట్లుగా ఉంటుందని నిజమే మరి....
8, జులై 2010, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)


0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి