చలి కాలం అయినందు వల్ల తెల్లవారుజామున ఆరు గంటలకు కూడా సూరీడు ఇంకా కనపడటం లేదు. ఆకాశం అంతా నారింజ రంగు పులుముకుంది. ఒక వైపు సూరీడు వస్తున్నా కూడా చందమామ కి వెళ్ళాలని అనిపించడం లేదనుకుంట సూరీడు అందాన్ని చూసి ఇంకా నిండుగానే ఆకాశంలో కనిపిస్తున్నాడు. ఆకాశం లో పక్షులు చద్రుడిని అందుకేనేందుకు గుమౌగా అటు వైపే వెళ్తున్నాయి. కోకిల పాటలు కోడి కూతలు నా మనసుని మేల్కొలుపుతున్నట్లుగా తోస్తుంది. వరి చేను పసుపు మరియు ఆకు పచ్చ రంగులతో మెరిసిపోతుంది. పొగ మంచు వల్ల ఏర్పడిన నీటి బిందువులు చెట్ల ఆకుల చివరన ఉండి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తనలో దాచుకుని ఆ ప్రపంచాన్ని కన్పించి కనిపించకుండా చాలా చిన్నగా చూపిస్తున్నాయి.పొగ మంచు వల్ల దూరంలో ఉన్నవేమి కనపడటం లేదు. ప్రపంచం అంచు ఇంకో పది అడుగుల దూరంలో ఉన్నట్లుగా ఉంది. నా కాళ్ళకు చెప్పులు లేకపోవడంతో చేను గట్టు మీద అక్కడక్కడ ఉన్న రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఎక్కడో సుప్రభాతం వినపడుతుంది కాని నా దగ్గర రేడియో లేదన్న ఆలోచన నాకు రావటం లేదు. సుప్రభాతం అయిపోయిన తర్వాత "లాహిరి లాహిరిలో", "అందమే ఆనందమే", " భలే మంచి రోజు" లాంటి పాత పాటలు పల్లవి వరకు వచ్చి మారిపోతున్నాయి. ఆ రోజేంటో అన్ని నాకు ఇష్టమయిన పాటలే వస్తున్నాయి రేడియో లో. ఆ సమయంలో అక్కడ చెప్పులు లేకుండా ఎందుకూ నడుస్తున్నానో ఏం చేద్దామని వచ్చానో నాకేమి గుర్తురావటం లేదు. అయినా కాని అలా ప్రకృతి ని చూస్తూ గమ్యం తెలీని దారిలో నడుస్తూ ఉంటె చాలా ఆహ్లాదంగా ఉంది. దూరంగా ఉన్న కొలను దగ్గరికి నడుచుకుంటూ వెళ్లాను. చుట్టూ మామిడి చెట్లతో చాలా అందంగా ఉంది ఆ ప్రదేశం. కొలనులోని నీళ్ళు ఈ అందాన్ని చూస్తూ అలలు అలలుగా వస్తూ ఎగిరే చేప పిల్లలతో అతలాడుతున్నాయి.
అలా కొంత దూరం నడిచే సరికి ఒక రైల్వే స్టేషన్ కనపడింది. చందానగర్ స్టేషన్ అని రాసి ఉంది. మళ్ళి ఆలోచనలు మొదలయ్యాయి, హైదరాబాదు లో ఇంత అందమయిన ప్రదేశాలు అదీ చందానగర్ దగ్గరలో ఎలా వచ్చాయా అని. లోపలి వెళ్ళాను.స్టేషన్ అంత ఖాళీగా ఉంది. అక్కడక్కడ కొంత మంది మాత్రమె కనిపిస్తున్నారు. ఇద్దరు ముసలి వాళ్ళు ప్రేమికులల కబుర్లు చెప్పుకుంటున్నారు అవతలి ప్లాట్ ఫారం మీద. స్టేషన్ లో అన్నౌన్సుమేంట్ కి బదులుగా చందమామ రావే పాట వస్తుంది. ఒక అమ్మ వల్ల బాబు కి గోరు ముద్దలు తినిపిస్తుంది. బాబు వాళ్ళ నాన్నతో కలిసి ప్లాట్ ఫారం నీడ ఉన్న వేయింగ్ మెషిన్ లో బరువు చూసుకుంటున్నారు. వాళ్ళ అమ్మని కూడా బరువు చూసికోమని బలవంతపెడుతున్నారు. అమ్మాయిలకయినా అమ్మలకైన బరువు చూసుకోడం అంటే ఎప్పటికయినా భయమే కదా అందుకే వద్దని చిన్న పిల్లలా మారం చేస్తుంది. ఆ బాబు అన్నం తినను అన్నాడో ఏం అన్నాడో గాని అమ్మకు తప్పలేదు చివరకి. నాకు వినపడలేదు గాని అలా అనే ఉంటాడని నా నమ్మకం. ఎందుకంటే అమ్మ ప్రేమ అలాంటిది, చిన్న వయసులో తన పిల్లలకి అన్నం తినిపించడానికి ఏమయినా చేస్తారు అమ్మలు. వాళ్ళ అమ్మ రూపాయి బిళ్ళ వేస్తుండగా బాబు మెషిన్ మీద ఒక కాలు వేసాడు. ఒక 20-30 kg లు ఎక్కువగా చూపించడం తో ఆ బరువు చూపించే పేపర్ ను ఎవరికీ ఇవ్వకుండా ఇది పనిచేయడం లేదు అని వాదిస్తూ సరదాగా గొడవ పడ్తూ దాచేస్తుంది. ఎందుకు అంత చూపించిందో ఆ బాబు కి కాక నాకు మాత్రమే తెల్సు. అమ్మ నాన్న పిల్లలు ఇలాంటి మనవ సంబందాలు ఎంత బావుంటాయో అని అన్కుంటూ నవ్వుకున్నాను. ఇంతలో భారి వర్షం పడేలా కారు మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. అప్పుడప్పుడే కొంచం కొంచం గా గుర్తు వస్తుంది. ఏదో ప్రశాంతతను వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చానని. ప్లాట్ ఫారం మీద ఇందాక ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళారో తెలీదు గాని ఎవ్వరు లేరు. అంత చీకటిగా అయ్పాయింది. ఏమీ కనిపించడం లేదు. కేవలం చిరు వర్షం లో తడిసిన మట్టి వాసన మాత్రమె వస్తుంది.
చీకట్లో కూడా దూరంగా ఏదో వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు మెల్లిగా నా దగ్గరకే వస్తున్నట్లుగా ఉంది. బహుశా ట్రైన్ వస్తుందేమో అనుకున్నాను. కాని ఇంత చలిలో కూడా మొహం చాలా వేడిగా అయ్పోతుంది. కాళ్ళ కింద భూమి మాయమయ్యి నేను అనంతమయిన శూన్యం లోకి పడిపోతున్నాను. ఎందుకు పద్తున్ననో తెలిసే లోగా తల నేలను బలంగా తగిలింది. కళ్ళు తెరిచి చూసే సరికి మంచ పక్కన ఉన్నాను. ఇదంతా కల అని, ఇందాక కలలో కనిపించిన వెలుగు కిటికిలోంచి పడ్తున్న ఎండా అని, శూన్యం లోకి పడింది స్టేషన్ లోంచి కాదు మంచం మీద నుంచి అని అర్థం అయ్యాయి. జీవితం లో ఎలాంటి చిన్న చిన్న ఆనందాలను,మనుషుల మద్య అత్మీయతలను కోల్పోతున్నామో అనుకుంటూ పైకి లేచి గడియారం చూసాను. సమయం తొమ్మిదిన్నర. ఈ రోజు కూడా ఆఫీసు కి గంట ఆలస్యం. పగటికలలు నిజమవ్తయన్న చిన్న ఆశతో తుమాలు పట్టుకొని యాత్రిక జీవనం లోకి పరుగు తీశాను.
26, నవంబర్ 2010, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)


1 కామెంట్లు:
బాబోయ్..కలలో కూడా మీకు చందానగర్ లోనే కనిపిస్తాయా అందమైన ప్రదేశాలు..
చాలా బాగుండండి మీ పగటి కల...:)
కామెంట్ను పోస్ట్ చేయండి